Italy-Amritsar Flight : ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125మందికి కరోనా

ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్​సర్​కు వచ్చిన ఎయిర్​ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్​సర్​ లో విమానం దిగిన తర్వాత చేసిన

Italy-Amritsar Flight : ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125మందికి కరోనా

Passengers

Italy-Amritsar Flight : ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్​సర్​కు వచ్చిన ఎయిర్​ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్​సర్​ లో విమానం దిగిన తర్వాత చేసిన టెస్ట్ లలో వీరికి పాజిటివ్ గా తేలిందని ఎయిర్ పోర్ట్ డైరక్టర్ వీకే సేథ్ తెలిపారు. మొత్తం విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు,దేశంలో కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ దేశవ్యాప్తంగా 90,928 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన కేసుల కంటే 56శాతం ఎక్కువ కేసులు ఇవాళ నమోదయ్యాయి. ఇక,కోవిడ్,ఒమిక్రాన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 15-18 ఏళ్ల వయస్సు వారికి కూడా ఈ నెల 3 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

ALSO READ Modi-Kovind : పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతితో మోదీ భేటీ