ఢిల్లీలో దారుణం : కోవిడ్ సెంటర్ లో బాలికపై అత్యాచారం..వీడియో తీసిన మరో యువకుడు

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 12:06 PM IST
ఢిల్లీలో దారుణం : కోవిడ్ సెంటర్ లో బాలికపై అత్యాచారం..వీడియో తీసిన మరో యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో ముందుకొచ్చి జరిగిన ఘోరాన్ని పోలీసుల ఎదుట వెల్లడించింది. దీంతో ఇద్దరు దుర్మార్గులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు కోవిడ్ వ్యాధితో బాధ పడుతున్న వీరు కోలుకున్న అనంతరం జైలుకు తరలించనున్నారు.

దక్షిణ ఢిల్లీలోని ఛతర్ పూర్ లో 10 వేల పడకల కోవిడ్ కేర్ సెంటర్ (సర్దార్ పటేల్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. జులై పస్ట్ వీక్ లో 14 ఏళ్ల బాలికతో పాటు కుటుంబసభ్యులు కరోనా లక్షణాలతో ఇక్కడ చేరి చికిత్స పొందుతున్నారు. అదే సెంటర్ లో 19 ఏళ్ల యువకుడు అతని కుటుంసభ్యులు కూడా చికిత్స పొందుతున్నారు.

యువకుడు స్నేహితుడు కూడా అక్కడనే ఉన్నాడు. బాలిక మీద గత కొన్ని రోజులుగా కన్నేశారు. జులై 15వ తేదీ అర్దరాత్రి మూత్ర విసర్జన చేసేందుకు క్వారంటైన్ లో ఉన్న బాత్ రూంకు వెళ్లింది. అదను కోసం చూస్తున్న ఆ యువకులు..బాత్ రూం వద్దకు చేరుకున్నారు. 19 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. అదే సమయంలో మరో యువకుడు మొబైల్ లో దారుణాన్ని వీడియో తీశాడు.

అనంతరం తమ కోరిక తీర్చాలని, లేకపోతే వీడియో బయటపెడుతామని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు.
జరిగిన ఘోరాన్ని ధైర్యం కుటుంబసభ్యులకు తెలియచేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు ఇద్దరు కామాంధులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. కోర్టు ఎదుట హాజరు పరిచామని, బాలికను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ (సౌత్) పర్వీందర్ సింగ్ తెలిపారు. వీడియో తీసిన మొబైల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.