యూపీలో మరో దారుణం: 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
UPలో మరో టీనేజర్ పై Gang Rape జరిగింది. కాన్పూర్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. రాత్రి సమయంలో బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
గోవింద్ బాల్మీకి (19), అజయ్ అలియాస్ శివ్ బోధన్ (30)లు నిందితులుగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక పేరెంట్స్ కు విషయాన్ని తెలియజేసింది.
వారిపై పోలీసులు ఐపీసీ సంబంధిత సెక్షన్ల ప్రకారం.. శుక్రవారం కేసులు ఫైల్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా.ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు విషయం తెలిసిన వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేశారని వెల్లడించారు.