Delhi : ఢిల్లీలో ఘోరం..బాలిక అవయవాలు తీసేసుకుని..బాడీ లోపల ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసిన డాక్టర్లు

అనారోగ్యంతో బాధపడే తమ కూతుర్ని హాస్పిటల్ కు తీసుకొస్తే ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగిలించి శరీరంలో ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసి మృతదేహాన్ని తమకు అప్పగించారని కన్నీరు మున్నీరుగా ఏడుస్తు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Delhi : ఢిల్లీలో ఘోరం..బాలిక అవయవాలు తీసేసుకుని..బాడీ లోపల ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసిన డాక్టర్లు

15 Years Girl organs 'stolen' during surgery..body 'stuffed' with plastic bags

Delhi : ఢిల్లీలో డాక్టర్లు చేసిన ఘోరానికి 15 ఏళ్ల తమ కూతురు చనిపోయింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడే తమ కూతుర్ని హాస్పిటల్ కు తీసుకొస్తే ఆపరేషన్ పేరుతో డాక్టర్లు తమ బిడ్డ అవయవాలు దొంగిలించి శరీరంలో ప్లాస్టిక్ కవర్లు పెట్టి కుట్టేసి మృతదేహాన్ని తమకు అప్పగించారని కన్నీరు మున్నీరుగా ఏడుస్తు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలిక మృతదేహాన్ని తమకు అప్పగించాక అంత్యక్రియలు చేస్తుంటే శరీరం నిండా సర్జరీ జరిగినట్లుగా కుట్లు ఉన్నాయని..గాయాల్లోనుంచి పాలిథిన్ బ్యాగులు కనిపించాయని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతదేహానికి మంగళవారం (జనవరి 31,2023) నాడు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. దీనికి సంబంధించి రిపోర్టు వచ్చాక తదపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అపెండిసైటిస్‌కు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. 24వ తేదీన బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. 26వ తేదీన బాలిక చనిపోయినట్లు ప్రకటించారు.డాక్టర్లు చెప్పారు. దీంతో బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. బాలిక శరీరాన్ని పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, వాటిలో పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ పేరుతో తమ కూతురు అవయవాలను తీసుకున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై కేసు పెట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడుతూ..బాలిక మృతదేహాన్ని జనవరి 31న పోస్ట్ మార్టం జరిపించామని..ఆ రిపోర్టు వస్తే బాలిక మరణానికి కారణమేంటనేది తెలుస్తుందని ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.