Mystery: వీడిన 160ఏళ్ల మిస్టరీ .. పాడుబడ్డ బావిలో పుర్రెలెవరివో తేలింది..
మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని ...

Mystery: మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పంజాబ్ యూనివర్శిటీ, బీర్బల్ సాహ్ని ఇన్సిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ఇతర పరిశోధకులతో కలిసి శాస్త్రవేత్తలు తేల్చారు. 2014లో పంజాబ్లోని అజ్నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్దఎత్తున మానవ పుర్రెలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు జరుగుతుండగా, తాజాగా ఇవి 160ఏళ్ల నాటి మానవుల పెర్రెలు అని, ఇవి గంగానదీ పరీవాహక ప్రాంత ప్రజలవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Moon Mystery : చంద్రుడికి మరో ముఖం వుందా? నిండు జాబిలిపై ఆ మచ్చలేమిటి? సైన్స్ ఏం చెప్తోంది?
2014 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని అజ్నాలాలో పాడుబడ్డ బావిలో పెద్ద మొత్తంలో మానవ కపాలాలు బయటపడ్డాయి. అయితే వీటిని 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని కొందరు, కాదు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారిని కావచ్చు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ యూనివర్శిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సెహ్రావత్, సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్ సాహ్నీ ఇన్స్టిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పాడుబడ్డ బావిలో లభ్యమైన పుర్రెల నుంచి డీఎన్ఏను వెలికితీసి పరిశీలించగా మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రచారంలో కథనాలేవీ కావని.. ఈ పుర్రెలు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది.
Mystery Disease : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు
ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్ఏ ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రజల డీఎన్ఏతో సరిపోలుతోందని డాక్టర్ సెహ్రావత్ వివరించారు. 26వ బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీ బెటాలియన్ లో బెంగాల్ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిషా, బిహార్, యూపీలకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోందని వివరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్ కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్థాన్ ప్రాంతంలోని మియాన్ మీర్ ప్రాంతంలో నియమించారని, బ్రిటీష్ అధికారులపై తిరుగుబాటు క్రమంలో బ్రిటీష్ అధికారులు వీరిని అజ్నాలా సమీపంలో బంధించి చంపేసినట్లు చరిత్ర చెబుతోందని పరిశోధనల్లో తేలింది. అయితే ఈ పరిశోధనల్లో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పరిశోధనలతో కీలక పాత్ర పోషించిన బెనారస్ హిందూ యూనివర్శిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చేరుస్తాయని ఇప్పటి వరకూ ఎవరూ గుర్తించని తొలి స్వాతంత్ర్య సంగ్రామం ఇదే కావచ్చునని ఆయన పేర్కొన్నారు.

Wall
- Sidhu Moose Wala: ఎన్నికల్లో పోటీపై సిద్ధూ తండ్రి స్పష్టత
- Sidhu Moose Wala: సిద్ధూ మూస్ వాలా హత్య కారణంగా జైలులో గొడవలు
- Punjab: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు
- Sidhu Moose Wala: కేంద్ర సంస్థలతో దర్యాప్తు.. అమిత్ షాకు లేఖ రాసిన సిద్ధూ కుటుంబం
- Student Dead: అమ్మాయి కోసం విద్యార్థుల ఘర్షణ.. ఒకరు మృతి
1Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
2TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
3Telangana Covid Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
4Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
5Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
6మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
7ద్రౌపది కామెంట్లపై.. వెనక్కి తగ్గిన ఆర్జీవీ
8నిలిచిపోయిన మిషన్ భగీరథ నీరు
9అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉంది
10అమలాపురంలో హై అలర్ట్ ..!
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్ఫ్లిక్స్కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్స్టాగ్రామ్లో వయస్సు వెరిఫికేషన్కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?