COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,604 మందికి కరోనా.. 18,317 యాక్టివ్ కేసులు

దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,317 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,604 మందికి కరోనా.. 18,317 యాక్టివ్ కేసులు

Corona

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 18,317 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుతం రికవరీ రేటు 98.77 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,081 మంది కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,04,933గా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు వేసిన కరోనా డోసుల సంఖ్య 219.63 కోట్లుగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వాటిలో రెండో డోసుల సంఖ్య 95.02 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. ప్రికాషన్ డోసుల సంఖ్య 22.08 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. నిన్న దేశంలో 1,39,111 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించినట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 90.08 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 1,57,218 పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..