కరోనా వైరస్ సోకి 18 మంది పోలీసులు మృతి
భారత దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా వైరస్ సోకి 18 మంది పోలీసులు మరణించారు. రాష్ట్రంలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కోవిడ్ వైరస్ సోకి మృత్యువాత పడటం విషాదాన్ని నింపుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1666 మంది పోలీసులకి కరోనా సోకగా, 18 మంది మరణించారు.
ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైరస్ కారణంగానే కన్ను మూసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరం బిర్ సింగ్ చెప్పారు. వయసు పైబడిన కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన సెలవులో ఉండగా శుక్రవారం కన్నుమూసినట్లు పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా ఆయనకు సంతాపం ప్రకటించారు. మే 21న కరోనా కారణంగా ఎఎస్ఐ భివ్సేన్ హరిభావును కోల్పోయామని, వరుసగా పోలీసులు వైరస్కు బలికావడం పట్ల రాష్ట్ర డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Mumbai Police regrets to inform about the unfortunate demise of HC Arun Phadtare from Vile Parle PStn. Being in the high-risk age-group, HC Phadtare was on leave for the past few days.
We pray for his soul to rest in peace. Our thoughts and prayers are with the Phadtare family.
— Mumbai Police (@MumbaiPolice) May 22, 2020
ఇప్పటికే వయసు పైబడిన వారిని విధుల్లోకి రావొద్దంటూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక సంఖ్యలో మహారాష్ర్టలో పోలీసులు మృత్యువాత పడుతుండటంతో సిబ్బంది కొరత కూడా ఏర్పడింది. ఈ పరిస్ధితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకోసం సాయుధ పోలీసు దళాల నుండి సుమారు 2000 మంది అదనపు పోలీసులను కేటాయించమని కోంద్రాన్ని కోరింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ర్టలోనే కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ర్టంలో ఇప్పటివరకు 44,582 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1517 కు పెరగగా, శుక్రవారం ఒక్కరోజే 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read: రాక్ స్టార్ సీఎం : గిటార్ వాయించిన మేఘాలయా సీఎం సంగ్మా