The Supreme Court: విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు 18 ఏళ్ల జైలు శిక్ష.. ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు ఒక వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. బాధితుడిపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో కోర్టు ఇన్నేళ్ల శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

The Supreme Court: విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు 18 ఏళ్ల జైలు శిక్ష.. ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

The Supreme Court: విద్యుత్ చౌర్యం, హత్య.. రెండూ ఒక్కటి కాదని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు. విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకుగాను ఒక వ్యక్తికి విధించిన 18 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇది సరైన న్యాయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇక్రమ్ అనే వ్యక్తి రెండేళ్లపాటు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. 2018లో ఇది గుర్తించిన యూపీ విద్యుత్ శాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం 2019లో అతడ్ని అరెస్టు చేశారు. అప్పట్నుంచి జైల్లోనే ఉంటున్నాడు. విద్యుత్ చౌర్యానికి సంబంధించి ఇక్రమ్‌పై ప్రభుత్వం 9 ఎఫ్ఐఆర్‪లు నమోదు చేసింది. వీటిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు అతడికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2020లో ఈ తీర్పు వెలువరించింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసులు కొట్టివేసి, విడుదల చేయాలని కోరాడు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బాధితుడిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించాడు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Big Bash League: టీ20 క్రికెట్లో సంచలనం… 15 పరుగులకే ఆలౌటైన జట్టు

విద్యుత్ చౌర్యం చేయడం, హత్య చేయడం ఒక్కటి కాదని.. విద్యుత్ చౌర్యానికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడు ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించినందున వెంటనే అతడ్ని విడుదల చేయాలని ఆదేశించింది. యూపీలో విద్యుత్ చౌర్యానికి పాల్పడితే సెక్షన్ 136 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇక్రమ్‌పై ఇతర అనుబంధ కేసులు కూడా నమోదు చేయడంతో అతడి శిక్ష 18 ఏళ్లకు పెరిగింది. తాజాగా సుప్రీం ఆదేశాలతో బాధితుడు జైలు నుంచి విడుదల కానున్నాడు.