Steal Money: లవర్ కోసం పేరెంట్స్కు నిద్ర మాత్రలిచ్చి సొంతింట్లోనే రూ.13లక్షలు దొంగతనం
సొంతింట్లోనే రూ.13లక్షల డబ్బు, 3లక్షల విలువైన బంగారం కాజేసి లవర్ ను కాపాడబోయింది ఓ టీనేజర్. ఇంట్లో దొంగలు పడి సొత్తు కాజేశారని పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం బయటపడింది.
Steal Money: సొంతింట్లోనే రూ.13లక్షల డబ్బు, 3లక్షల విలువైన బంగారం కాజేసి లవర్ ను కాపాడబోయింది ఓ టీనేజర్. ఇంట్లో దొంగలు పడి సొత్తు కాజేశారని పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం బయటపడింది.
విలువైన వస్తువులు దాచిపెట్టే లాకర్లు అన్ని పగులగొట్టి ఉన్నాయి. ఇంటి లోపలికి వచ్చేందుకు బయట వ్యక్తులు ఎటువంటి ప్రయత్నం చేసినట్లుగా లేదు. ఇంట్లో మిగతా సభ్యులను విచారించేసరికి వారి కూతురు ఖుష్బూ ఈ నేరానికి పాల్పడినట్లు తెలిసింది.
ఆమెతో పాటు వినయ్ యాదవ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు శనివారం సాయంత్రం పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన వస్తువులన్నింటినీ స్వాధీన పరచుకున్నారు. ఈ నేరంలో భాగమైన రంజిత్ యాదవ్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖుష్బూ తండ్రి మనోజ్.. వినయ్ యాదవ్ తో కూతురికి ఉన్న రిలేషన్ ను ఒప్పుకోలేదు. దాంతో డబ్బు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. స్లీపింగ్ పిల్స్ను కషాయంలో కలిపి పేరెంట్స్కు ఇచ్చింది. పేరెంట్స్ మత్తులోకి జారేలా చేసి.. వారు స్పృహ కోల్పోగానే వినయ్ అతని సహచరుడ్ని ఇంట్లోకి వచ్చేలా చేసింది.
వాళ్లు వెళ్లిపోగానే తలుపులు వేసుకుని నిద్రపోయింది. విచారణలో కషాయం తానెందుకు తాగలేదని పోలీసులు అడగడంతో వివరణ ఇచ్చుకోలేక బయటపడింది.