35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెందిన రాజమాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులను హతమార్చారు. దీనిపై మధుర జిల్లా సాధనారాణి ఠాకూర్ తీర్పునిచ్చారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సమయంలో…ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న రాజామాన్ సింగ్ సీఎం హెలికాప్టర్ వైపు జీపులో దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల ఘటన జరిగిన మరునాడే రాజామాన్ సింగ్, అతని అనుచరులను పోలీసులు డీగ్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు.
వీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో పోలీసు టీం 1985, ఫిబ్రవరి 21వ తేదీన రాజామాన్ సింగ్, అతని ఇద్దరు అనుచరులు సుమేర్ సింగ్, హరిసింగ్ లను హతమార్చారు. శిక్ష పడిన వారిలో డీగ్ డీఎస్ పీ కాన్ పింగ్ (82), స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జీ, ఎస్ఐ వీరేంద్ర సింగ్ (78) ఉన్నారు.
ఏఎస్ఐ రవిశంకర్, కానిస్టేబుల్స్ సుక్రామ్, జీవన్రామ్, జగ్మోహన్, భన్వర్సింగ్, హరిసింగ్, ఛత్తార్ సింగ్, షేర్ సింగ్, దయారాం, రవిశేఖర్లకు ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. వీరంతా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే.