టీ తాగి ఆశ్రమంలోనే ఇద్దరు సాధువుల మృతి

టీ తాగి ఆశ్రమంలోనే ఇద్దరు సాధువుల మృతి

Sadhus Died: ఇద్దరు సాధువులు ఆశ్రమంలోనే చాయ్ తాగి చనిపోయారు. మూడో వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని హాస్పిటల్‌లో చేర్చించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. గులాబ్ సింగ్, శ్యాం సుందర్ అనే ఇద్దరి శవాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు.

చనిపోయిన వారిద్దరిలో 60సంవత్సరాల వయస్సున్న గులాబ్ సింగ్ ఆశ్రమంలోనే చనిపోయాడని తెలియగా, శ్యామ్ సుందర్ (61)ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. మూడో వ్యక్తి అయిన రాంబాబు జిల్లా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.



వారి చావుల వెనుక కారణం తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ అన్నారు. ఈ మేరకు ఆశ్రమం నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడింది ఫోరెన్సిక్ టీం.

గులాబ్ సింగ్ దలౌత గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, శ్యాం సుందర్, రాంబాబు పైంథా గ్రామవాసులు. బాధితుల సోదరుడు గోపాల్ దాస్ వారంతా ఆశ్రమంలోనే విషం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జిల్లా అధికారి సర్వగ్యా రాం మిశ్రా.. కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టామని ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.