Puducherry Children : పుదుచ్చేరిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ పాజిటివ్

పుదుచ్చురిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది.

Puducherry Children : పుదుచ్చేరిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ పాజిటివ్

Children

Puducherry Children పుదుచ్చురిలో 20మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది. గురువారం నిర్వహించిన పరీక్షల్లో 20మందికి పైగా చిన్నారులకి వీరందరికీ కోవిడ్ పాజిటివ్ గా తేలిందని ఆ రాష్ట్ర హెల్త్ డెరక్టర్ ఎస్ మోహన్ కుమార్ తెలిపారు.

కాదిర్కమమ్ లోని ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చిన్నారులు ట్రీట్మెంట్ పొందుతున్నట్లు మోహన్ కుమార్ చెప్పారు. అయితే ఆ చిన్నారుల వయస్సుకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

కాగా,పుదుచ్చేరిలో బుధవారం కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పుదుచ్చేరిలో బుధవారం నాటికి మొత్తం నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,405కి చేరగా..కోవిడ్ మరణాల సంఖ్య 1,773కి చేరింది.