COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,582 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,84,646గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.13 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదు

Corona

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 2,119 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,582 మంది కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,84,646గా ఉందని తెలిపింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.13 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.97 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో 219.50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 94.99 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసులు 21.99 కోట్లు ఉన్నట్లు చెప్పింది.

దేశంలో నిన్న 4,63,338 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 89.96 కోట్లుగా ఉందని పేర్కొంది. నిన్న దేశంలో 1,88,220 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..