Corona cases: దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు.. నిన్న 5,02,619 వ్యాక్సిన్ డోసుల వినియోగం

దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,373 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 26,625 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుత రికవరీ శాతం 98.76 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం 4,40,73,308గా ఉన్నట్లు చెప్పింది.

Corona cases: దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు.. నిన్న 5,02,619 వ్యాక్సిన్ డోసుల వినియోగం

India Corona Cases

Corona cases: దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,373 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 26,625 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుత రికవరీ శాతం 98.76 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం 4,40,73,308గా ఉన్నట్లు చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.04 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 89.86 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న దేశంలో 2,31,622 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 219.32 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

వాటిలో 94.95 కోట్ల రెండో డోసులు ఉన్నాయని చెప్పింది. అలాగే, బూస్టర్ డోసుల సంఖ్య 21.85 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న 5,02,619 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..