పెళ్లి అయి మూడు రోజులే..భార్య విడిచి వెళ్లిందని యువకుడు ఉరేసుకున్నాడు

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 10:24 AM IST
పెళ్లి అయి మూడు రోజులే..భార్య విడిచి వెళ్లిందని యువకుడు ఉరేసుకున్నాడు

పెళ్లి అయి మూడు రోజులే అయ్యింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు తల్లిదండ్రులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గోవిందరాజ్ తల్లి కాంచన పోలీసుకు ఫిర్యాదు చేసింది. వారి కథనం ప్రకారం…


తమిళనాడులో Perur Police పరిధిలోని Perumal Kovil స్ట్రీట్, Sennanurలో ఎన్.గోవిందరాజ్ (29) తల్లి కాంచనతో నివాసం ఉంటున్నాడు. వీరు నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలో బి.మంజులా దేవి యువతి కుటుంబం (Balabramanian, mother Rajeshwari and grandmother Sasikala)
కుటుంబం నివాసం ఉంటోంది.
https://10tv.in/husband-murder-attempt-on-wife-with-dumbbells-in-kakinada/
గోవింద రాజ్, మంజుల ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. గోవింద రాజ్ కుటుంబం నుంచి వ్యతిరేకత రాలేదు. ఈ క్రమంలో..స్నేహితుల సహకారంతో Sundakkamuthur ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 07వ తేదీన ఇరు కుటుంబసభ్యులు గొడవకు దిగారు.


దీంతో గోవింద రాజ్ తల్లి కాంచన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు కుటుంబసభ్యులను పీఎస్ కు పిలిచారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. తన తల్లిదండ్రులతో ఉంటానని మంజుల చెప్పింది. అంతేగాకుండా…మంగళసూత్రాన్ని గోవింద రాజ్ కు అప్పగించింది. ఇదిలా ఉండగా…2020, సెప్టెంబర్ 08వ తేదీ రాత్రి యువతి తండ్రి Balabramanian గోవింద రాజ్ ను దూషించాడని సమాచారం.


సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఉరి వేసుకున్నాడు. మంజుల కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కాంచన డిమాండ్ చేస్తున్నారు.