Corona : దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు, 309 మంది మృతి

దేశంలో కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. వీటిలో 3,26,71,167 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Corona : దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు, 309 మంది మృతి

Corona (6)

new corona cases in india : దేశంలో కొత్తగా 30,773 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,48,163కు చేరింది. వీటిలో 3,26,71,167 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా బారిన పడిన 3,32,158 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

కరోనా బారిన పడి 4,44,838 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 38,945 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని వెల్లడించింది. ఒక్క రోజులో 309 మంది మరణించారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో 19,325 కేసులు కేరళలో నమోదయ్యాయని, 143 మంది మృతి చెందారు.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులుదేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 80,43,72,331 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శనివారం ఒకే రోజు 85,42,732 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.