ఢిల్లీలో కొత్తగా 3,390 కరోనా కేసులు

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 09:46 PM IST
ఢిల్లీలో కొత్తగా 3,390 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 64 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 73, 780కి చేరింది. మొత్తం 2,429 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గతవారం రోజులుగా 14 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, గురువారం రికార్డు స్థాయిలో 17వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి. 

కరోనా వైరస్‌ కారణంగా ఒకేరోజు 418 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,71,697 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మహమ్మారి బారినపడిన వారిలో ఇప్పటివరకు 14,894 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 96, 30,625 కరోనా కేసులు నమోదయ్యాయి. 4, 87, 473 మంది మృతి చెందారు. అమెరికాలో 24, 83, 349 కరోనా కేసులు ఉండగా 1,24, 586 మంది మృతి చెందారు. బ్రెజిల్ లో 12, 07, 721 కరోనా కేసులు నమోదవ్వగా 54, 434 మంది మృతి చెందారు. రష్యాలో 6,13, 994 కేసులు నమోదయ్యాయి. 8,605 మంది మృతి చెందారు. యూకేలో 3, 07, 980 కరోనా కేసులు నయోదు కాగా 43, 230 మంది మృతి చెందారు.