కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: గోడ కూలి నలుగురు మృతి 

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 06:48 AM IST
కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: గోడ కూలి నలుగురు మృతి 

శ్రీ కృష్ణా జన్మష్టమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ విషాదం నెలకొంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 27మంది తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల..తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు  చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం మమతా ఆకాంక్షించారు.