New Ministers Take Oath : ప్రమాణస్వీకారం చేసిన కొత్త కేంద్ర మంత్రులు
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు.
New Ministers Take Oath కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. రాజీనామా చేసిన పలువురు నేతలు సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కొత్త కేంద్రమంత్రులు వీళ్లే
నారాయణ్ రాణె,సర్బానంద సోనోవాల్,డాక్టర్ వీరేంద్ర కుమార్,జ్యోతిరాదిత్య సింధియా,రామ్చంద్ర ప్రసాద్ సింగ్,అశ్విని వైష్ణవ్,పశుపతి కుమార్ పరాస్,కిరణ్ రిజిజు,రాజ్కుమార్ సింగ్,హర్దీప్ సింగ్ పూరి,మన్సుఖ్ మాండవీయ,భూపేందర్ యాదవ్,పర్షోత్తమ్ రూపాలా,జి. కిషన్ రెడ్డి,అనురాగ్ సింగ్ ఠాకూర్,పంకజ్ చౌదరి,అనుప్రియా సింగ్ పటేల్,సత్యపాల్ సింగ్ బాఘెల్,రాజీవ్ చంద్రశేఖర్,శోభా కరాంద్లాజే,భానుప్రతాప్ సింగ్ వర్మ,దర్శన విక్రమ్ జర్దోష్,మీనాక్షి లేఖి,అన్నపూర్ణ దేవి,నారాయణస్వామి,కౌషల్ కిశోర్,అజయ్ భట్,బీఎల్ వర్మ,అజయ్ కుమార్,చౌహాన్ దేవ్సిన్హ్,భగవత్ ఖూబా,కపిల్ మోరేశ్వర్ పాటిల్,ప్రతిమా భౌమిక్,సుభాష్ సర్కార్,భగ్వత్ కిషన్రావ్ కరాడ్,రాజ్కుమార్ రంజన్ సింగ్,భారతి ప్రవీణ్ పవార్,బిశ్వేశ్వర్ తుడు,శాంతను ఠాకూర్,ముంజపార మహేంద్రభాయి,జాన్ బార్లా,ఎల్. మురుగన్,నితీశ్ ప్రమాణిక్.
కాగా, హర్దీప్ సింగ్ పురీ, కిరెణ్ రిజిజు,కిషన్ రెడ్డి,రాజ్కుమార్ సింగ్లు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న వీరు కేబినెట్ హోదా దక్కించుకున్నారు.