5G Network : అతి త్వరలోనే ఇండియాకు 5G.. ఆ 13 నగరాల్లోనే ఫస్ట్.. ఎక్కడెక్కడంటే?
5G Network : భారతదేశానికి 5G నెట్ వర్క్ వచ్చేస్తోంది. భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. రాబోయే నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది.

5G Network : భారతదేశానికి 5G నెట్ వర్క్ వచ్చేస్తోంది. భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. రాబోయే నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 5G వేలంలో స్పెక్ట్రమ్ ధరలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దేశంలో 4G నెట్వర్క్ కన్నా 5G నెట్వర్క్ ద్వారా 10 రెట్లు హైస్పీడ్ డేటాను యూజర్లు పొందుతారని మంత్రివర్గం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ వేలాన్ని ఆమోదించడంతో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నోటీసు ఇన్విటింగ్ అప్లికేషన్ (NIA) ప్రక్రియ ప్రారంభం కానుంది.
5G సర్వీసులు ఎప్పుడు అనేది ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కానీ, వినియోగదారులు 2022లోనే 5G సర్వీసులను పొందే అవకాశం కనిపిస్తోంది. ఇండియాలో ఆగస్ట్ 15న 5G సర్వీసులు ప్రారంభం కావచ్చని గతంలో నివేదిక వెల్లడించింది. అది జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 5G కమర్షియల్ ప్రకటన సెప్టెంబర్లో వెలువడే అవకాశం ఉంది.

5g Commercial Roll Out Will Happen In 13 Major Cities In India
5G ప్రారంభ దశలో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. రానురాను 5G సర్వీసులు దేశమంతా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో 5G సర్వీసులు ప్రారంభం కాగానే దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. 5G నెట్వర్క్ అందరికీ చేరుకోవడానికి ఏళ్ల తరబడి సమయం పట్టవచ్చు. మనం 4Gలోనూ ఇదే పరిస్థితిని చూశాం.. 4G నెట్వర్క్ అందుబాటులో లేని కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితమే.. లడఖ్ ప్రాంతంలో తొలిసారిగా 4G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ప్రకారం.. 5G మొదట భారతదేశంలోని 13 ప్రధాన నగరాలకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అందులో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, ముంబై, కోల్కతా ఉన్నాయి. ప్రస్తుతం, ఏ టెలికాం ఆపరేటర్ మొదట 5G సర్వీసులను విడుదల చేస్తుందనేది ఎలాంటి సమాచారం లేదు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz 3300 MHz వంటి అనేక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో మొత్తం 72GHz స్పెక్ట్రమ్ వేలం జరుగనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also : 5G Network: ఫైనల్ స్టేజికి చేరుకున్న 5జీ నెట్వర్క్ పనులు
- Hyderabad : హైదరాబాద్ లో ఐసిస్ కలకలం…సానుభూతి పరుడు అరెస్ట్
- H.M Amit Shah: సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీలు కూడా నేరాల డేటాబేస్లో చేరాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- NIA Conduct Searches : జమ్మూ కశ్మీర్, రాజస్ధాన్ లలో ఎన్ఐఏ సోదాలు
- Aadhaar number: మీ ఆధార్తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..
- Darbhanga Blast Case : దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
1Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
2Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం
3Kaali poster dispute: కాళీమాత పోస్టర్పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
4SpiceJet: మరో స్పైస్జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు
5Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
6Twitter: కేంద్రంపై కర్ణాటక హై కోర్టుకు ట్విట్టర్.. కేంద్రంతో ముదిరిన వార్
7Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
8PM Modi: చిరస్మరణీయ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నా..! ట్విటర్లో వీడియో పోస్టు చేసిన మోదీ
9Lavanya Tripathi: క్యూట్ ఫోటోలతో మనసుల్ని దోచేస్తున్న సొట్ట బుగ్గల చిన్నది!
10Lady Thief : సింపుల్గా బస్సెక్కి దిగుతూ.. 6నెలల్లోనే రూ.27లక్షలు సంపాదన.. పోలీసుల అదుపులో కి’లేడీ’
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్వాచ్లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
-
Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Krithi Shetty: మహేష్, చరణ్లపై బేబమ్మ కామెంట్స్.. అందుకేనా..?