పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, ఆరుగురు చిన్నారులతో సహా 14మంది దుర్మరణం

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, ఆరుగురు చిన్నారులతో సహా 14మంది దుర్మరణం

ఆరుగురు చిన్నారులతో సహా 14మంది రోడ్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో గురువారం పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఫ్యామిలీకి ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 11గంటల 45నిమిషాల సమయంలో ప్రయాగ్‌రాజ్- లక్నో హైవే మీద దేశ్‌రాజ్ ఇనారా గ్రామానికి సమీపంలో ఘటన చోటు చేసుకుంది.

టైర్ పంక్చర్ అయి హైవే పక్కన ట్రక్ ఆగి ఉంది. వేగంగా వచ్చిన కారు ట్రక్ ను ఢీ కొట్టడంతో సగ భాగం వరకూ లోనికి ఇరుక్కుపోయింది. కుందా గ్రామంలో జరిగిన పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ట్రక్ లో ఇరుక్కుపోయిన 5 డెడీ బాడీస్ ను బయటకు తీశారు. ఈ ఘటనలో మొత్తం 14మంది చనిపోగా వారిలో ఆరుగురు చిన్నారులే.



7నుంచి 15ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న వారు ఆరుగురు ఉండగా, 20నుంచి 60మధ్య వయస్కులు 8మంది ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో మాట్లాడి వీలైనంత సహాయం చేయగలిగామని ఎస్పీ ఆర్య అన్నారు. మృతదేహాలన్నింటినీ పోస్టు మార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఎస్‌యూవీ, ట్రక్ ఓనర్లను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
https://10tv.in/pet-dogs-death-chhattisgarh-woman-kills-self/
సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘటనపై తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వీలైనంత సహాయం చేయాలని ఆదేశించారు.