Train Derails: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

ముంబై (బాంద్రా) నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.

Train Derails: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

Train Derails: రాజస్థాన్‌లో ఆదివారం అర్ధరాత్రి రైలు ప్రమాదం జరిగింది. ముంబై-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. జోధ్‌పూర్ డివిజన్ పరిధిలోని రాజ్‌కియావాస్-బొమద్రా సెక్షన్ పరిధిలో రాత్రి 03.27 నిమిషాలకు రైలు పట్టాలు తప్పింది.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

ముంబై (బాంద్రా) నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌లు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల మిగతా 11 బోగీలు కూడా నిలిచిపోయాయి. అయితే, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

ప్రయాణికులందరినీ ఆ బస్సుల్లో తరలించారు. ఈ ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ జరపనున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు సంబంధించి సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.