Strange Incident : అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక బ్రతికిన వృద్ధురాలు

వృద్ధురాలి మృతదేహాన్ని అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక మళ్లీ బ్రతికి కళ్లు తెరిచి చూశారు. ఫిరోజాబాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Strange Incident : అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక బ్రతికిన వృద్ధురాలు

ALIVE

Strange Incident :  చనిపోయిన తర్వాత మళ్లీ బ్రతకడం సాధ్యమా? సాధ్యం కాదు.. కానీ ఓ వృద్ధురాలు మళ్లీ బ్రతికారు.  ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వృద్ధురాలి మృతదేహాన్ని అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక మళ్లీ బ్రతికి కళ్లు తెరిచి చూశారు. ఫిరోజాబాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే… 81 ఏళ్ల హరిభేజి అనే వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలిని కడసారి చూసేందుకు బంధువులందరూ వచ్చారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర సంప్రదాయం ప్రకారం జరగాల్సిన క్రతువును పూర్తి చేసి పాడెపై మృతేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు స్మశానానికి తీసుకెళ్లారు. అనంతరం దహనం చేసేందుకు పాడెపై నుంచి కాష్టం పైకి ఆమె మృతదేహాన్ని మారుస్తుండగా ఒక్కసారిగా వృద్ధురాలు కళ్లు తెరిచి చూశారు.

రాత్రి శ్మశానలోంచి ఏడుపు…గుంతలోంచి పసిగుడ్డును వెలికితీసిన స్థానికులు

దీంతో అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొద్ది సేపటి తర్వాత వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్లారు.  చనిపోయారనుకున్న ఆమె మళ్లీ బ్రతకడంతో అందరూ సంతోషపడ్డారు.  కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు ఉండలేదు. ఆ మురుసటి రోజే అనారోగ్యంతో ఆమె మరణించారు. దీంతో మరోసారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో అంత్యక్రియల కోసం వారందరూ వచ్చారు. హరిభేజి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుమారుడు సుగ్రీవ్ సింగ్ తల్లి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.