దేశవ్యాప్తంగా కొత్తగా 8వేల 171 కరోనా కేసులు
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజూకూ పెరిగిపోతూనే ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్ మరింతగా విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. లేటెస్ట్గా 24 గంటల్లో కొత్తగా 8వేల 171మంది కరోనా పాజిటివ్గా తేలారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 98వేల 706 కి చేరుకుంది.
గడచిన 24 గంటల్లో మరో 204 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,598కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 97,581 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 95,526గా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో మరణాల రేటు 3.3% నుండి 2.83% కి పడిపోయింది. మరోవైపు, రికవరీ రేటు ఇప్పుడు రోగులలో 48.2% కి చేరుకుంది.
Read: ఢిల్లీలో 20వేల మార్క్ దాటిన కరోనా కేసులు