8th Pay Commission : 8వ పే కమీషన్ పై కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు తెలిపారు.

8th Pay Commission : 8వ పే కమీషన్ పై కేంద్రం కీలక ప్రకటన

8th pay commission

8th Pay Commission :  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా, తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా అని అఢిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

1947 నుండి ఇంత వరకు   ప్రభుత్వం ఏడు పే కమీషన్లు ఏర్పాట చేసింది. ప్రతి పదేళ్ల కొకసారి  ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. భారతదేశంలో మొదటి పే కమిషన్ జనవరి 1946లో ఏర్పాటైంది. వేతన సంఘం ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి మంత్రి సమాధానమిస్తూ.. వారి జీతాల వాస్తవ విలువలో   కోతను భర్తీ చేయడానికి వీలుగా డీఏ (కరువు భత్యం)  ఇస్తున్నట్టు మంత్రి బదులిచ్చారు. భారత వినియోగదారుల ధరల సూచిక కింద అంచనా వేసిన ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలావుండగా, ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో డియర్‌నెస్ అలవెన్స్ రేటులో మరో సవరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Also Read : UP Minister Rakesh Sachan 1 year jailed : ఆయుధాల చట్టం కేసులో యూపీ మంత్రికి ఏడాది జైలు శిక్ష