Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా న్యాయ పోరాటం.. విజయం సాధించిన 93ఏళ్ల వృద్ధురాలు

ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.

Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా న్యాయ పోరాటం.. విజయం సాధించిన 93ఏళ్ల వృద్ధురాలు

Bombay High Court

Alice D’Souza : ఆస్తి వివాదంలో 80 ఏళ్లుగా చేసిన న్యాయ పోరాటానికి 93ఏళ్ల వృద్ధురాలు విజయం లభించింది. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో బాంబే హైకోర్టు ఆలిస్ డిసూజా(93)కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ అపార్టమెంట్ మొదటి అంతస్తులో 500, 600 చదరపు అడుగుల రెండు ఫ్లాట్లకు సదరు మహిళ యజమానురాలు అవుతారని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. మార్చి28, 1942లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం సదరు ప్రవేట్ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు జులై 1946లో బ్రిటీష్ ప్రభుత్వం తీర్మానం చేసింది. అయినా ఆ ఆస్తి సదరుమ మహిళకు దక్కలేదు.

Man Wins 22 Year Battle : రూ.20 కోసం 22 ఏళ్లు న్యాయపోరాటం..ఎట్టకేలకు ఫలించింది

దీంతో 1946 నాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులను అమలు జేయాలని, తన ఆస్తిని తనకు ఇవ్వాలని డిపూజా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆస్తిని డిసూజా భౌతికంగా స్వాధీనం చేసుకోలేకపోయారని కోర్టు పేర్కొంది.