Railway Staff Covid19 : బాబోయ్.. 93వేల మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియ‌న్ రైల్వేస్‌లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మ‌న్, సీఈవో సునీత్ శ‌ర్మ తెలిపారు. ఈ కేసుల సంఖ్య గ‌త కొద్ది వారాల నుంచి తీవ్ర‌మైంద‌న్నారు. క‌రోనా బారిన ప‌డ్డ రైల్వే ఉద్యోగుల‌కు రైల్వేస్‌కు సంబంధించిన 72 ఆస్ప‌త్రుల్లో చికిత్స కొన‌సాగుతోంద‌ని, 5వేల‌కు పైగా ప‌డ‌క‌ల‌ను సిద్ధంగా ఉంచామ‌ని ఆయన వెల్లడించారు.

Railway Staff Covid19 : బాబోయ్.. 93వేల మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

Railway Staff Covid19

Railway Staff Covid19 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియ‌న్ రైల్వేస్‌లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మ‌న్, సీఈవో సునీత్ శ‌ర్మ తెలిపారు. ఈ కేసుల సంఖ్య గ‌త కొద్ది వారాల నుంచి తీవ్ర‌మైంద‌న్నారు. క‌రోనా బారిన ప‌డ్డ రైల్వే ఉద్యోగుల‌కు రైల్వేస్‌కు సంబంధించిన 72 ఆస్ప‌త్రుల్లో చికిత్స కొన‌సాగుతోంద‌ని, 5వేల‌కు పైగా ప‌డ‌క‌ల‌ను సిద్ధంగా ఉంచామ‌ని ఆయన వెల్లడించారు.

క‌రోనా తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న ఉద్యోగులు హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్యుల సూచ‌న‌లను పాటిస్తున్న‌ట్లు చెప్పారు. రైల్వేలో ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు అయినా డ్రైవ‌ర్లు, గార్డ్స్, మెయింటెన‌ర్స్, స్టేష‌న్ మాస్ట‌ర్లు, టీటీఈల‌తో పాటు స్టేష‌న్ సిబ్బంది విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని శర్మ వివరించారు. ఈ పరిస్థితుల్లో రైళ్లను నడిపించడం పెద్ద చాలెంజ్ అని శర్మ చెప్పారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే పనులు జరిగేలా చూస్తామన్నారు.

రైల్వే కేవలం ప్రయాణికులు, గూడ్స్ కోసం మాత్రమే కాదు ఇతర ముఖ్యమైన వస్తువులను కూడా వేగంగా ట్రాన్స్ పోర్టు చేస్తుంది. ప్రస్తుతం రైల్వే సంస్థ కొన్ని చాలెంజ్ లు ఎదుర్కోంటోంది. దేశానికి సేవలు అందించేందుకు 12లక్షల మంది రైల్వే ఉద్యోగులు 24గంటల పాటు పని చేస్తున్నారని మిశ్రా చెప్పారు.

దేశంపై కరోనా దండయాత్ర:
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి రెట్టింపు వేగంతో విస్తరిస్తుండడంతో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు మూడు లక్షలకుపైగా కేసులు, రెండు వేలకుపైగా మరణాలు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల వరకు కరోనా కేసులు నమోదవగా.. 7వేలకుపైగా జనం ప్రాణాలు వదిలారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3లక్షల 46వేల 786 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం(ఏప్రిల్ 24,2021) తెలిపింది. మరో 2వేల 624 మంది ప్రాణాలు కోల్పోయారు.

25లక్షల యాక్టివ్ కేసులు:
తాజాగా 2,19,838 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,66,10,481కు చేరగా.. ఇప్పటి వరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. మొత్తం 1,89,544 మంది మహమ్మారితో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 13కోట్ల 83లక్షల 79వేల 832 డోసులు వేశారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా టెస్టులు భారీగానే సాగుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒకే రోజు 17.53లక్షల శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్పటివరకు వరకు 27.61 లక్షల నమూనాలను పరిశీలించారు.