Selfie: సెల్ఫీ మోజులో.. ప్రేమజంట మృతి
సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
Selfie: సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
బీదర్ లోని కర్ణాటక కాలేజీలో బీఏ చదువుతున్న పురుషోత్తం పాటిల్ అనే విద్యార్థి.. గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదువుతున్న తన ప్రియురాలు రక్షితతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. సోమవారం ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరు లేని సమయంలో తమ ఫోన్ లో సెల్ఫీ తీసుకుంటుండగా జారీ నదిలో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మృతి చెందారు.
వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. యువతి కుటుంబ సభ్యులు బీదర్ జిల్లా రామనగర పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తమ కూతురు కనిపించడం లేదని తెలిపారు. ఫోన్ దొరికిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు చుట్టూ గమనించారు.. నదిలో పడినట్లు ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా రక్షిత కనిపించలేదు.. మంగళవారం ఉదయం నదిలో రెండు మృతదేహాలు పైకి తేలాయి.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వీరు ప్రమాదవశాత్తు పడ్డారా? లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం తెలియరాలేదు.. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.