Landslide : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు…శిథిలాల కింద 80 మంది

హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.

Landslide : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ విరిగిపడ్డ కొండ చరియలు…శిథిలాల కింద 80 మంది

Himachal

landslide in himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం కొండ చరియల కింద 80 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్, ఆర్టీసీ బస్సుతోపాటు పలు వాహనాలు కొండ చరియల కింద చిక్కుకున్నాయి.

రిక్ కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే.