విమానం టేకాఫ్ అవుతుండగా తనకు కరోనా ఉందని చెప్పిన ప్రయాణికుడు
Corona for a person traveling on a plane : చావు కబురు చల్లగా అన్నట్లు.. ఓ విమాన ప్రయాణికుడు టెన్షన్ పెట్టించేశాడు. కరోనా భయంతో ఇప్పటికీ విమాన ప్రయాణాలంటే బెంబేలెత్తున్న ప్రజలకు.. ఫ్లైట్ ఎక్కాలంటేనే ఆలోచించేలా చేశాడు.
ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ఎక్కిన ఓ ప్రయాణికుడు.. అందులో ఉన్న అందరినీ షాక్య్యేలా చేశాడు. తనకు కోవిడ్ పాజిటివ్ ఉందని.. ప్రయాణికుల మేలు కోసం ఫ్లైట్ను ఆపాలంటూ టేకాఫ్లో ఉండగా పైలట్ను కోరాడు.
దీంతో అవాక్కవ్వడం విమానంలో ఉన్నవారి వంతైంది. వెంటనే అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది కోవిడ్ పేషెంట్ కూర్చున్న మూడు వరుసల్లోని ప్రయాణికులను అలర్ట్ చేశారు. వారిని ఫ్లైట్లోనే కంటైన్మెంట్ రూమ్కి తరలించారు.
ప్లైట్ను ఆపి.. కోవిడ్ బాధితున్ని దింపేసిన సిబ్బంది.. అతన్ని సౌత్ ఢిల్లీలోని ఓ కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులందరికీ పీపీఈ కిట్లు అందించారు. సీట్లను పూర్తిగా శానిటైజ్ చేశాక.. ఆ ఫ్లైట్ పుణెకు పయనమైంది.