A school bus accident: 40 మందితో వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా.. ఓ చిన్నారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్‌లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి ఇళ్ల నుంచి స్కూలు బస్సులో పాఠశాలకు బయల్దేరారు. అయితే, ప్రమాదం చోటు చేసుకుని బస్సు బోల్తా పడింది. దీంతో ఓ విద్యార్థి మృతి చెందగా, గాయపడ్డ మరో ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని మిగతా 37 మంది చిన్నారులు సురక్షితంగానే ఉన్నారు.

A school bus accident: 40 మందితో వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా.. ఓ చిన్నారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

A school bus accident: మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్‌లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం… ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి ఇళ్ల నుంచి స్కూలు బస్సులో పాఠశాలకు బయల్దేరారు. అయితే, ప్రమాదం చోటు చేసుకుని బస్సు బోల్తా పడింది.

దీంతో ఓ విద్యార్థి మృతి చెందగా, గాయపడ్డ మరో ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని మిగతా 37 మంది చిన్నారులు సురక్షితంగానే ఉన్నారు. ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్కూలు బస్సు బోల్తా పడిందన్న విషయం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే బస్సు వద్దకు పరుగులు తీస్తూ వచ్చారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,230 మందికి కొవిడ్