Asani Cyclone : తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు అసాని తుపాను ముప్పు

అండమాన్‌ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 979 కిలోమీటర్ల దూరంలో.. పూరీకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది.

Asani Cyclone : తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు అసాని తుపాను ముప్పు

Asani (1)

Asani cyclone : మండుటెండల్లో తుపాను దూసుకొస్తోంది. తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించే దిశగా ముందుకు కదులుతోంది. తెలుగు రాష్ట్రాలకు అసాని తుపాను ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఏపీలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీవ్ర తుపానుగా మారింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో.. ప్రయాణిస్తోంది. రాగల 24 గంటల్లో తుపాను కాస్తా.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

అండమాన్‌ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 979 కిలోమీటర్ల దూరంలో.. పూరీకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇక.. ఎల్లుండి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతమై.. దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో.. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసాని తుపాను తీరం దాటే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Asani Cyclone : బంగాళాఖాతంలో అసాని తుఫాను.. గంటకు 13 కి.మీ వేగంతో పయనం

దీంతో మత్స్యాకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీ, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అసాని తుపాను ముంచుకొస్తుండటంతో అండమాన్ సహా.. ఒడిశా, బెంగాల్, సిక్కిం, అస్సాం, ఏపీ, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.

ఒడిశాపై ఈ తుపాను మరింత ప్రభావం చూపనుంది. తీర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది ఒడిశా ప్రభుత్వం. అత్యవసర బృందాలను రిజర్వ్‌లో ఉంచారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌లను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే ఒడిశాలో ఫైర్, అత్యవసర విభాగాల్లోని ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు.