Explosion In Jammu : జమ్ములో పేలుడు.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
జమ్ముకశ్మర్ లోని జమ్ములో పేలుడు కలకలం రేపింది. మంగళవారం రాత్రి జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన దగ్గర అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Explosion In Jammu : జమ్ముకశ్మర్ లోని జమ్ములో పేలుడు కలకలం రేపింది. మంగళవారం రాత్రి జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన దగ్గర అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సిధ్రా బ్రిడ్జి చెకింగ్ పాయింట్ వద్ద భారీ పేలుడు జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని, ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై తనిఖీలు చేస్తున్నట్లు జమ్ము సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీల వెల్లడించారు. ఈ పేలుడు ఘటనకు పాల్పడ్డ వారు ఎవరనేది తెలియలేదని తెలిపారు. కేస నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.