Young Woman Gang Raped : మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై గ్యాంగ్ రేప్

యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Young Woman Gang Raped : మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై గ్యాంగ్ రేప్

Young Woman Gang Raped

Young Woman Gang Raped : యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మోదీన‌గ‌ర్ పట్ట‌ణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్న 19 ఏళ్ల యువ‌తి ఆదివారం బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లింది. అక్క‌డ ఓ వ్య‌క్తి ఆమెకు మ‌త్తు మందు క‌లిపిన కూల్ డ్రింక్‌ను ఇచ్చాడు. ఆమెను రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు.

అతని ఇద్దరి స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. కొంత సేప‌టికి మ‌త్తు నుంచి తేరుకున్న ఆ యువతి వారిని ప్ర‌తిఘ‌టించింది. అయితే ఆ స‌మ‌యంలో యువ‌తిని ఆ ముగ్గురు యువ‌కులు బెదిరించారు. విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని హెచ్చ‌రించారు. అనంతరం అక్క‌డి నుంచి ఆ ముగ్గురు యువ‌కులు పారిపోయారు.  యువ‌తి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది.

Disabled Girl Raped : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..దివ్యాంగ బాలిక‌పై అత్యాచారం

తండ్రితో క‌లిసి యువ‌తి మోదీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ముగ్గురు యువకులు యువతిపై అత్యాచారానికి పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువ‌తికి వైద్య ప‌రీక్షలు నిర్వ‌హించి సామూహిక అత్యాచారం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. నిందితులు శేఖ‌ర్‌, కృష్ణ‌, అర్జున్‌గా గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.