అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 08:38 AM IST
అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్

భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం (మార్చి-1,2019) ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. మధ్యాహ్నాం 3గంటల సమయంలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఆయన భారత్ లోకి అడుగుపెట్టనున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేందుకు వాఘా సరిహద్దుల్లో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

పాక్ యుద్ధ విమానాలను తిప్పికొట్టే క్రమంలో పాక్ ఆర్మీకి అభినందన్ చిక్కిన విషయం తెలిసిందే. తమ అదుపులో ఉన్న అభినందన్ ను శాంతి ప్రక్రియలో భాగంగా విడుదల చేస్తున్నట్లు గురువారం పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి