Vijay : సైకిల్ పై వచ్చి ఓటేసిన స్టార్ హీరో.. కారణం అదేనా?

తమిళనాడులో నేడు(ఏప్రిల్ 6,2021) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సైకిల్ పై వచ్చి ఓటు వేయడం విశేషం. తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్ కు వచ్చారు.

Vijay : సైకిల్ పై వచ్చి ఓటేసిన స్టార్ హీరో.. కారణం అదేనా?

Vijay

Actor Vijay cycles to polling station : తమిళనాడులో నేడు(ఏప్రిల్ 6,2021) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సైకిల్ పై వచ్చి ఓటు వేయడం విశేషం. తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ పోలింగ్ బూత్ కు వచ్చారు. ముఖానికి మాస్కు ధరించిన విజయ్.. స్పోర్ట్స్ సైకిల్ పై ట్రాఫిక్ లో ప్రయాణిస్తూ చెన్నైలోని నీలంకరై పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సెలెబ్రిటీ అయినా సాధారణ వ్యక్తిలా క్యూలైన్ లో నిల్చుని ఓటు వేశారు విజయ్.

What happened to Vijay's cycle after the actor's sensational poll booth entry

విజయ్ సైకిల్ పై రావడానికి కారణం ఇంధన ధరలే అంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగానే సైకిల్ ఎంచుకున్నారని ప్రచారం జరిగింది. బీజేపీ కూటమికి ఓటేయవద్దని పరోక్షంగా చెప్పడానికే ఇలా చేశారని టాక్ వినిపించింది. అయితే విజయ్ అధికార ప్రతినిధి ఈ ప్రచారాన్ని ఖండించారు. తన నివాసం నుంచి పోలింగ్ బూత్ దగ్గరే కాబట్టి విజయ్ సైకిల్ పై వెళ్లారని వివరణ ఇచ్చారు.

తమ అభిమాన నటుడు సైకిల్‌పై కన్పించడంతో అభిమానులు ఆశ్యర్యపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇవాళ(ఏప్రిల్ 6,2021) ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు పోటెత్తారు. స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్, అజిత్ వంటి సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అభిమాని ఫోన్ లాక్కున్న అగ్రహీరో:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన స్టార్ హీరో అజిత్, అభిమానులపై సీరియస్ అయ్యారు. అంతేకాదు ఓ అభిమాని చేతి నుంచి అతడి ఫోన్ లాక్కున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోప్పడ్డారు. ఓటు వేసేందుకు అజిత్ తన భార్య షాలినీతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకుని అజిత్ బయటకు వచ్చాక.. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. అభిమాన నటుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఓ అభిమాని మాస్కు కూడా తీసేశాడు. అసలే ఇది కరోనా టైమ్. పైగా మాస్కు కూడా లేదు. దీంతో అజిత్ కు పిచ్చ కోపం వచ్చింది. ఈ అభిమాని తీరుని తప్పు పడుతూ అతడి ఫోన్ లాక్కున్నాడు. ఊహించని ఈ ఘటనతో అతడు బిత్తరపోయాడు. కాసేపటి తర్వాత.. అజిత్ ఫోన్ ని సదురు అభిమానికి వెనక్కి ఇచ్చాడు. అంతేకాదు సారీ కూడా చెప్పి తన గొప్ప మనసు చాటుకున్నాడు.