బెంగాల్ లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రచారం

  • Published By: venkaiahnaidu ,Published On : November 18, 2020 / 09:58 PM IST
బెంగాల్ లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రచారం

Congress, Left parties to jointly organise programmes పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్…నవంబర్-23నుంచి 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.



మంగళవారం జరిగిన కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్​-వామపక్షాల కూటమి గురించి ప్రజలకెలా అవగాహన కల్పించాలనే విషయాలను చర్చించేందుకు నాయకులు మంగళవారం సమావేశం అయ్యారు.



ఈ కూటమి చాలా శక్తివంతమైనదని,తృణముల్ కాంగ్రెస్,భారతీయ జనతాపార్టీల నుంచి బెంగాల్ ప్రజలకు ప్రత్యామ్నాయ ఆఫ్షన్ ఇచ్చేందుకు ఈ కూటమి కెమిస్ట్రీ బెంగాల్ లోని క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ కి చేరుకోవాలని వెస్ట్ బెంగాల్ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయని, వామపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపింది.