Vande Bharat Express: వందే భారత్ రైలు ప్రమాదంపై ప్రశ్నించగా, భిన్న రీతిలో స్పందించిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జరిగింది. రాష్ట్రంలోని మాల్దా వద్ద కొందరు ఆగంతకులు మంగళవారం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. దీంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమైంది.
Vande Bharat Express: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జరిగింది. రాష్ట్రంలోని మాల్దా వద్ద కొందరు ఆగంతకులు మంగళవారం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. దీంతో రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమైంది.
Uttar Pradesh: సుప్రీం కోర్టులో యోగి ప్రభుత్వానికి పెద్ద ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించగా, దీనిపై ఆమె సమాధానం చెప్పకపోగా భిన్న రీతిలో స్పందించారు. తను మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలేంటని ఎదురు ప్రశ్నించారు. ‘‘అలాంటి ప్రశ్నలు ఇప్పుడు అడక్కండి. నేను గంగాసాగర్ మేళాకి వెళ్తున్నాను. నేనిప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. గంగాసాగర్ గురించి ఏమైనా అడగండి’’ అని మమత అన్నారు.
Bharat Jodo Yatra: రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటానంటున్న బీజేపీ నేత.. కాకపోతే ఒక్క షరతు!