Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం
52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది.

Gyanvapi Mosque: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో వీడియో సర్వే నిర్వహణపై గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడింది. 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది. ఈమేరకు వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం నుంచి జ్ఞానవాపి మసీదు ప్రాంతం వరకు ఉన్న రహదారులను పోలీసులు మూసివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. శనివారం ఉదయం ఇరుపక్షాల సభ్యులతో(పిటిషన్ తరుపు వారు, మసీదు నిర్వాహకులు) కలిసి మసీదులోకి ప్రవేశించిన సర్వే అధికారుల బృందం ముందుగా మసీదులోని భూగర్భ ప్రాంతంలో ఉన్న మూడు గదులను పరిశీలించారు.
Other Stories:Chintan Shivir: కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్.. పార్టీ నేతలతో రాహుల్ భేటీ
అనంతరం మసీదులోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న గోడను సర్వే చేశారు అధికారులు. సర్వే సమయంలో మసీదులోని ఏవైనా గదులు తాళం వేసి ఉన్నా.. వాటిని పగలగొట్టి సర్వే కొనసాగించాలని అపెక్స్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సర్వే సమయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పూర్తి అంశాలను పర్యవేక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్ మరియు పోలీసు కమిషనర్ను కోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలంటూ ముస్లిం మత పెద్దలు, మసీదు నిర్వాహకులు వేసిన పిటిషన్ ను జిల్లా మేజిస్ట్రేట్ తిరస్కరించింది. సర్వే కొనసాగి తీరుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Other Stories:Hunters Murder Police: మధ్యప్రదేశ్లో ఘోరం: కృష్ణ జింకల వేటకు వచ్చి ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపిన వేటగాళ్లు
ఈనేపధ్యంలో సర్వే నిమిత్తం అంతక్రితం నియమించిన అడ్వకేట్ కమిషనర్ కి తోడు మరో ఇద్దరు లాయర్లను కూడా అదనంగా నియమించింది జిల్లా కోర్టు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో హిందూ దేవతల ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం ఆ ఆలయాల్లోని దేవతలు పూజలకు నోచుకోవడం లేదని ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈక్రమంలో వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఈ సర్వేకు ఆదేశించింది. పూర్తి విచారణ అనంతరం మే 17లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
- Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
- Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
- Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
- Sadhguru Jaggi Vasudev : దండయాత్రల్లో ధ్వంసం చేయబడిన దేవాలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు : సద్గురు జగ్గీ వాసుదేవ్
- IFS Vivek Kumar: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి వివేక్ కుమార్ నియామకం
1Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో 100 కోట్ల సినిమా..
2ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
3Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..
4Imran Khan: భారత్పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
5Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
6Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
7Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్డే సెలబ్రేషన్స్
8Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!
9Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
10Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్