నా ఆవు చచ్చిపోయింది : అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏడుపు 

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 09:36 AM IST
నా ఆవు చచ్చిపోయింది : అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏడుపు 

జైపూర్ : ఆయనో ఎమ్మెల్యే..అసెంబ్లీకొచ్చారు..అసెంబ్లీ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం కూడా ముగిసింది. ఈ క్రమంలో తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న ఆవు చనిపోయింది అంటు ఓ ఎమ్మెల్యే శాసనసభలో కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. జనవరి 21న  రాజస్థాన్ శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే అమీన్ ఖాన్ కన్నీరు పెట్టకున్న ఘటన జరిగింది. 
 

 గో సంరక్షణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ ఖాన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం పాల వ్యాపారం చేస్తుంటుందనీ..అందుకే ఆవులతో తమకు ఎంతో మమకారం ఏర్పడిందన్నారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యుల వలెనే ఆవులతో కూడా ప్రత్యేక అనుంబంధం ఉంటుందనీ..వీటిలో అన్ని ఆవుల్లో కంటే ఒక ఆవును తాను ఎంతో ప్రాణంగా చూసుకునేవాడిననీ..ఆ ఆవు అది ఇటీవలే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషిలాగానే ఆ ఆవు తాను ఇంటి వద్ద వున్నంతసేపు తన పక్కనే వుండేదనీ..దాని  ముఖం గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్లు ఆగటంలేదనీ అమీన్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురవుతు కన్నీరు పెట్టుకున్నారు.  గోసంరక్షణ పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.