మోడీ,అమిత్ షా లు కూడా వలసవాదులే….కాంగ్రెస్
దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడంపై లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తీసుకొచ్చారని, భారత్ ఏ ఒక్క మతానికో పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం వలవాదులేనని అన్నారు.
అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ…హిందుస్తాన్ అందరిదీ. ఈ దేశం ఏ ఒక్కరికో చెందింది కాదు. సర్వనదుల సమ్మేళనం ఈ ప్రాంతం. సర్వ జాతుల, మతాల ఐక్యత ఈ దేశం. గంగా, యమునా, తేహజీబ్ ఈ దేశం. ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ఎన్ఆర్సీ తీసుకువచ్చారు. ముస్లింలు ఈ దేశవాసులే. వాళ్లు ఈ సంస్కృతిలో భాగమే. వలసవాదం గురించి మాట్లాడితే ఈ దేశంలో చాలా మంది వలసవాదులు ఉన్నారు. ఎక్కడో గుజరాత్కు చెందిన మోదీ, అమిత్ షా.. ఢిల్లీలో నివసిస్తున్నారు. వాళ్లూ కూడా వలసవాదులేనని చౌదరి అన్నారు.
#WATCH Congress leader Adhir Ranjan Chowdhury:.. Hindustan sab ke liye hai, ye Hindustan kisi ki jageer hai kya? Sabka samaan adhikaar hai. Amit Shah ji, Narendra Modi ji aap khud ghuspetiye hain. Ghar aapka Gujarat agaye Dilli, aap khud migrant hain. pic.twitter.com/zrCaSfPF7v
— ANI (@ANI) December 1, 2019