Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 07:12 AM IST
Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే

బాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు.

ఆయన కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ వచ్చినా, ఇద్దరూ ఇంటివద్దే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వీరిద్దరికీ చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు సరిగ్గా అందిస్తున్నారని, ఇద్దరు కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారని తెలుస్తోంది.

మరోవైపు అమితాబ్ కుటుంబం క్షేమంగా ఆరోగ్యవంతంగా రావాలని ప్రముఖులు కోరుకుంటున్నారు. పలువురు పూజలు చేస్తున్నారు. దీనిపై అమితాబ్ కూడా స్పందిస్తున్నారు. ఆసుపత్రి నుంచే..వీడియో ద్వారా అభిమానులకు సందేశం పంపిస్తున్నారు.

మీ ప్రేమాభిమానాల వరదలో తడిసి ముద్దవుతున్నాను. మీ ప్రేమకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి నేను చీకటిలో ఉన్నాను. మీ అందరి అభిమానానికి తలవంచి నమస్కరిస్తున్నాను అని అమితాబ్ వెల్లడించారు.

Read Here>>బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ తెలుగు రీమేక్‌లో!