అదే పాట.. ఈమె నోట : మరో రేణు మొండాల్ వచ్చేసింది!

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 01:14 PM IST
అదే పాట.. ఈమె నోట : మరో రేణు మొండాల్ వచ్చేసింది!

సోషల్‌ మీడియా స్టార్ ‘ఏక్‌ ప్యార్‌కా నగ్మా హై’ అనే హిందీ పాటతో సింగర్‌గా మారిన గాయనీ రేణు మొండాల్‌ పోటీగా మరో గాయనీ వచ్చింది. అచ్చం రేణు మొండాల్ మాదిరిగానే కనిపిస్తోంది. రైల్వే స్టేషల్‌లో లతా మంగేష్కర్‌ పాడిన పాటలను రేణు మొండాల్ పాడుతూ ఎలా పాపులర్ అయిందో ఈ కొత్త గాయనీ కూడా అలాగే పాడుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రేణు మొండాల్ డబుల్ డూప్ అని తెలియక చాలామంది తానేంటీ మళ్లీ ఇలా అయిపోందని అంటున్నారు. 

నిజానికి అసలు రేణు  మొండాల్ ఇప్పుడు ఒక రేంజులో ఉంది. బాలీవుడ్‌  మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్‌ రెష్మియా ప్రోత్సాహించి ఆయన సినిమాలో పాడే అవకాశం ఇచ్చాడు. దీంతో రేణు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలో పాడేందుకు వరుస ఆఫర్లతో రేణు బిజీగా ఉంది. 

రేణు  మొండాల్ ముఖకవలికలు, హావభావాలతో పోలిన గౌహతికి చెందిన ఓ మహిళ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రేణు  పాడిన ‘తేరి మేరి కహానీ’ సాంగ్ ను ఈమె కూడా బాగా పాడేస్తోంది. ఈ మహిళ పాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ మరో రేణు  మొండాల్ వచ్చేసిందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya

A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on