Anurag Kashyap : నా కూతురిని రేప్ చేసి చంపేస్తాన్నారు, నాకు గుండెపోటు వచ్చింది- ప్రముఖ డైరెక్టర్ తీవ్ర ఆవేదన

నా కూతురిని రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె బాధ చూడలేకపోయా. విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది.

Anurag Kashyap : నా కూతురిని రేప్ చేసి చంపేస్తాన్నారు, నాకు గుండెపోటు వచ్చింది- ప్రముఖ డైరెక్టర్ తీవ్ర ఆవేదన

Anurag Kashyap : బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను పడిన బాధను వ్యక్తపరిచారు. తాను మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నానని, తనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. దీనంతటికి కారణం తన కూతురికి వచ్చిన రేప్ బెదిరింపులే.. అని తాజాగా వివరించారు అనురాగ్ కశ్యప్.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తన మీద, తన కుటుంబం మీద కొందరు తీవ్రమైన ద్వేషం చూపించారని.. తన కూతురుని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారని.. సినిమాలు ఆపేసి తన కూతురు కోసం విదేశాలకు వెళ్లిపోయానని.. ఆ ట్రోలింగ్స్ వల్ల తాను మూడేళ్లు డిప్రెషన్‏లో ఉన్నానని.. అదే సమయంలో గుండెపోటు వచ్చిందని అనురాగ్ కశ్యప్ తెలిపారు.

Also Read : Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్.. అసత్య ప్రచారం అంటూ వారిపై ఫిర్యాదు..

”సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు.. కొందరు నా కుటుంబంపై ఎంతో ద్వేషం చూపించారు. నా కూతురు ఆలియా కశ్యప్ ను రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. లోలోపల చాలా బాధ పడింది. ఎంతో ధైర్యంగా ఉండే నా కూతురు ఆ ట్రోల్స్ కారణంగా ప్రతి దానికి కంగారు పడిపోతోంది. అదే నన్ను టెన్షన్ పెట్టింది. ఆమె బాధ చూడలేకపోయా. కూతురి కోసమే సినిమాలు ఆపేసి విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది. కోలుకున్న తర్వాత సినిమాలు స్టార్ట్ చేశా. ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండడంతో భారత్ తిరిగి రావాల్సి వచ్చింది” అని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. కశ్యప్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా 2023 జనవరిలో రిలీజ్ కానుంది.

Also Read : Rashmika Mandanna : రష్మికపై అక్కడ బ్యాన్..? ట్వీట్ చేసిన ఫిలిం క్రిటిక్.. నిజమేనా??

కాగా.. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. తాజాగా కశ్యప్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన పరిస్థితిని తెలుసుకుని అయ్యో పాపం అని జాలి చూపుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.