Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!
వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు

Taj Mahal: గత కొన్ని రోజులుగా తాజ్ మహల్ పై తలెత్తిన వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ..భారత పురావస్తుశాఖ అధికారులు..తాజ్ మహల్ లోని ఆ 22 గదుల చిత్రాలను విడుదల చేశారు. తాజ్ మహల్ లోని మూసివుంచిన 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన భారత పురావస్తుశాఖ అధికారులు.. ఆ గదుల్లో ఏమిలేదని మొదట నుంచి వివరణ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై చెలరేగిన వివాదానికి తెరదించేందుకు పురావస్తుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. తాజ్ మహల్ లోని మూసి ఉంచిన గదుల గురించి అసత్య ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురావస్తుశాఖ తెలిపింది.
Other Stories: Indian Army Jobs : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ
ఇప్పటి వరకు మూసి ఉంచిన గదుల్లో ఎటువంటి శాసనాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గదులన్నీ ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ వెబ్ సైట్ లో ఉంచిన గదుల తాలూకు చిత్రాలన్నీ తాజా చిత్రలేనని ఆగ్రా పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు. గదుల్లో చిన్నపాటి మరమ్మతులు జరిగాయని, ఆ మరమ్మతులకుగానూ రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ వివాదం ఎలా ఉన్నా, నడి వేసవిలోనూ తీవ్రమైన వేడిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ వీక్షించేందుకు వస్తున్నట్లు పర్యాటకశాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజే 20 వేల మందికి పైగా పర్యాటకులు తాజ్ సందర్శనకు వచ్చినట్లు పర్యాటకశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Other Stories:Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి
- Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్లో బంగారం ఎలా బయటపడింది
- Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్ను సంప్రదిస్తున్న అనేక దేశాలు
- PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
- Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
- Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్లో టెన్షన్.. ఎందుకో తెలుసా?