Food Delivery Companies: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా.. రాహుల్ ఆవేదన చూడండి ..
న్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత ఎక్కువ మంది తమ ఇండ్ల వద్దకు ఫుడ్ ఆర్డర్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేలా ఫుడ్ డెలివరీ సంస్థలు ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లేకంటే ఆఫర్లతో తక్కువ ధరకు ఫుడ్ ఇంటికే వస్తుందన్న భావనతో ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నాయి.
Food Delivery Companies: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత ఎక్కువ మంది తమ ఇండ్ల వద్దకు ఫుడ్ ఆర్డర్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేలా ఫుడ్ డెలివరీ సంస్థలు ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లేకంటే ఆఫర్లతో తక్కువ ధరకు ఫుడ్ ఇంటికే వస్తుందన్న భావనతో ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. కస్టమర్ల ఆలోచనను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఫుడ్ డెలివరీ కంపెనీలు అధిక ధరలతో మోసం చేస్తున్నాయంటూ రాహుల్ కాబ్రా అనే వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నేరుగా రెస్టారెంట్ కు వెళితే తక్కువ ధరకే మనకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుందని, అదే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఆర్డర్ చేస్తే ఆఫర్లు ప్రకటిస్తూనే కస్టమర్ల నుంచి అధిక సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ రాహుల్ అన్నారు.
ఇందుకు ఉదాహరణగా.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తన కస్టమర్ల నుండి ఏ విధంగా అధిక సొమ్మును వసూళ్లు చేస్తుందో చూడండి అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రాహుల్ వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఆర్డర్ చేశాడు. ఆఫ్లైన్ ఆర్డర్ బిల్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీతో కలుపుకుని రూ.512 వచ్చింది. ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అదికూడా రూ. 75 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను రాహుల్ కాబ్రా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ రెండు బిల్లులు చూడండి.. ఫుడ్ డెలివరీ దిగ్గజం వినియోగదారుల నుంచి ఏ విధంగా ఎక్కువ వసూలు చేస్తుందో తెలుస్తుందంటూ పేర్కొన్నాడు. రెండు బిల్లుల మధ్య వ్యతాన్ని చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. కొందరు రాహుల్ కాబ్రాకు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. గతంలో స్విగ్గీ నుంచి నాకు ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ పేర్కొన్నారు. కొందరు మాత్రం ఈ యాప్ లను తన ఫోన్ల నుంచి డిలీట్ చేసి పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినడం మచిందని బదులిచ్చాడు.