Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ వెల్లడించారు.

terrorists encounter : కశ్మీరీ టీవీ, సోషల్ మీడియా నటి అమ్రీన్ భట్ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్కౌంటర్ చేశాయి. అవంతిపొరాలోని అగన్హజిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిద్దరు స్థానిక ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి.
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే 56 రైఫిల్, నాలుగు మ్యాగ్జైన్లు, ఒక పిస్తోల్ను స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరు ఇటీవలే టెర్రరిస్ట్ క్యాంప్లో చేరినట్లు గుర్తించారు.
Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్లోని సౌర ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి. వీరిలో ముగ్గురు జైషే మహమ్మద్కు చెందినవారు కాగా.. ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు.
25వ తేదీన బుద్గాం జిల్లా చదూరలోని తన నివాసంలో ఉన్న అమ్రీన్పై రాత్రి 7.55 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
- Jammu And Kashmir: టెర్రరిస్టు కాల్పుల్లో మహిళా టీచర్ మృతి
- Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
- Rahul Bhat: జమ్మూలో ఎన్కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి
- Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి
- Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ
1Telangana Politics : కేసీఆర్ను టెన్షన్ పెట్టిస్తున్న పీకే..సర్వే రిపోర్టులతో గులాబీ బాస్ అలెర్ట్
2Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..
3Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు
4Mumbai Terror Attack : పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు..26/11 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ కు 15 ఏళ్ల జైలుశిక్ష
5Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
6Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
7Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
8Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
9Shirley Setia : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న షిర్లీ సేఠియా
10Priyanka Jawalkar : పద్దతిగా పరువాలు పరుస్తున్న ప్రియాంక జవాల్కర్
-
Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్ఫ్లిక్స్కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్స్టాగ్రామ్లో వయస్సు వెరిఫికేషన్కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు