మహింద్రా కారులో.. సీఎం స్వయంగా కారు నడుపుతూ.. బురదలో, గతుకుల రోడ్డులో.. ప్రజల కోసం సాహసం
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు.. తూర్పు అరుణాచల్లోని విజయనగర్ను సందర్శించారు. ఇది భారతదేశం-మయన్మార్ సరిహద్దు ప్రాంతం.. ఒక మహీంద్రా థార్లో ఉంది. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. ఈ మారుమూల కొండ ప్రాంతానికి వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు ఖండూ. మంత్రులు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు, పంచాయతీ ప్రతినిధులు కూడా ఎవరూ చేరుకోలేని చోటుకు చేరుకుని దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చాంగ్లాంగ్ జిల్లాలో ఉన్న విజయనగర్కు ఒక మోటరబుల్ రహదారి కూడా లేదు.. రాజకీయ నాయకులకు హెలికాప్టర్ ప్రయాణం తప్ప ఈ ప్రాంతానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం లేదు. స్థానికులు చదును చేయని రహదారులను ఉపయోగిస్తున్నారు, అవి చెత్త పరిస్థితులలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అడవులు, కొండలు కొనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడుపుకుంటూ ఖండూ ఆ ప్రాంతానికి వెళ్లారు.
రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో విశ్రాంతి తీసుకుంటూ.. ఏ సీఎం చేరుకోని ప్రాంతానికి.. సహాసం చేసి వెళ్లారు. సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోండగా.. ఈ ప్రయాణంలో ఆయన వెంట క్యాబినెట్ మంత్రులు కమ్లుంగ్ మొసాంగ్, హోంచన్, పలువురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అక్కడకు చేరుకున్న సీఎం పెమాఖండు విజయనగర్ ప్రాంత వాసులకు వరాలజల్లు కురిపించారు. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తానని, రహదారి నాణ్యతను అంచనా వేయడానికి ఈ ప్రయాణం చేపట్టినట్లు చెప్పారు.
2022 మార్చి నాటికి రోడ్డు మార్గాన్ని రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ మారుమూల ప్రాంతమైన విజయనగర్కి వెళ్లి అక్కడ నివసిస్తున్న యోబిన్ తెగ ప్రజలతో సంభాషించారు.
A story of our journey to reach the unreached…
It took us two days to reach #Vijaynagar from #Miao travelling 157km through mud and jungle.
Vijaynagar is a beautiful valley surrounded on three sides by Myanmar. @PMOIndia @HMOIndia @adgpi @MDoNER_India @MyGovArunachal pic.twitter.com/cqgtI5PK80
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) March 28, 2021