మోడీది హిట్లర్ పాలన: ముస్లీంలపై దాడులు చేస్తారా?
హిట్లర్ తరహాలో ప్రధాని మోడీ నియంత పాలనకు తెరతీశారని, విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. హిట్లర్ పాలనలో గూండాలు అమాయక ప్రజలను హింసించి చంపేవారని, అనేక మందిపై అక్రమంగా కేసులు పెట్టేవారని, మోడీ కూడా అదేవిధమైన పద్ధతిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. అధికారం కోసం హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తే, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మోడీ అనుచరులకు అర్థం కావట్లేదన్నారు.
హరియాణాలోని గురుగ్రామ్లో ఓ మైనారిటీ కుటుంబంపై కొంత మంది దాడి చేసినట్లు వార్తలు వచ్చిన క్రమంలో కేజ్రీవాల్ ఈ రకమైన వ్యాఖ్యలను ప్రధానిపై చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కేజ్రివాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అంటూ నిలదీశారు.
हिट्लर भी सत्ता के लिए यही करता था। हिट्लर के गुंडे लोगों को पीटते थे, उनका ख़ून करते थे और पुलिस जिन्हें मारा, उन्हीं के ख़िलाफ़ केस करती थी।
मोदी जी भी ये सत्ता के लिए करवा रहे हैं, हिट्लर के रास्ते चल रहे हैं। पर मोदी समर्थकों को दिखाई नहीं देता कि हमारा भारत किधर जा रहा है? https://t.co/egOHDZtSnO
— Arvind Kejriwal (@ArvindKejriwal) 23 March 2019