పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ…ఇండియా ప్రధాని..మీరు అబద్దాలేవాళ్లకు రాజు.ఉగ్రవాదంపై మీరు పోరాడాలనుకోవడం లేదు.మీరు ఉగ్రవాదంపై పోరాడాలనుకుంటే..మీరు చిత్తశుద్ది ఉంటే టెర్రరిజమ్ ఛార్జస్ ఎదుర్కొంటున్న సాధ్విని భోపాల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించేవాళ్లు కాదని అన్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ…మాలెగావ్ బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రగ్యా ఠాకూర్ ను బుధవారం ప్రకటించింది.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు.దిగ్విజయ్ ను ఢీ కొట్టాలంటే సాధ్వి సరైన వ్యక్తిని భావించిన బీజేపీ హైకమాండ్ ఆమె పార్టీలో చేరిన బుధవారం రోజునే ఆమెను భోపాల్ అభ్యర్థిగా ప్రకటించింది.అయితే బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్విని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
Asaduddin Owaisi, AIMIM in Aurangabad, Maharashtra: PM of India you are the king of liars, you don’t want to fight terrorism. If you wanted to fight terrorism, if you had class & sincerity then you would not have made a person with terrorism charges a candidate. (17/04/2019) pic.twitter.com/IKTJ71RVft
— ANI (@ANI) April 18, 2019